ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోదీ, బీజేపీ తీరును నిరసిస్తూ,,,కాంగ్రెస్, ఆర్జేడీ, ఎంఐఎం విమర్శలు

national |  Suryaa Desk  | Published : Sun, May 28, 2023, 09:21 PM

ప్రతిపక్షాల అభ్యంతరాల్ని పట్టించుకోకుండా మోదీ సర్కారు చేస్తున్న పార్లమెంటు ప్రారంభోత్సవంపై ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని ప్రతిపక్షాలు బహిష్కరించాయి. కాంగ్రెస్, ఆర్జేడీ, ఎంఐఎం పార్టీలు.. ప్రధాని మోదీ, బీజేపీ సర్కారు తీరును వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి.


ప్రధాన మంత్రి కొత్త పార్లమెంట్ ప్రారంభించిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని పట్టాభిషేక మహోత్సవంలా ఉందని పేర్కొన్నారు. పార్లమెంట్ అంటే ప్రజల గొంతుక అని.. పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని.. ప్రధాని మోదీ పట్టాభిషేకంలా భావిస్తున్నారంటూ ట్వీట్ చేశారు.అంతకుముందు కూడా పార్లమెంట్ గురించి రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కొత్త పార్లమెంట్ అహం అనే ఇటుకలతో నిర్మించబడదని, రాజ్యాంగ విలువలపైనే నిర్మితమవుతుందని విమర్శించారు.


పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్‌ - ఆర్జేడీ పార్టీ ట్విట్టర్‌ ద్వారా స్పందించింది. కొత్త పార్లమెంట్‌ భవనం శవపేటికలా ఉందంటూ సంచలన ట్వీట్‌ చేసింది. ఈ మేరకు శవపేటిక, పార్లమెంట్‌ నూతన భవనం ఫొటోలను ఆర్జేడీ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. దీనికి యే క్యా హై ( ఇది ఏంటి?) అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది.


అయితే దీనికి బీజేపీ కూడా అదే స్థాయిలో విమర్శలు గుప్పించింది. వచ్చే ఎన్నికల్లో ఆర్జేడీ పార్టీని కూడా ప్రజలు ఇలాంటి శవపేటికలోనే బొందపెడతారని ఆక్షేపించింది. అటు.. ఆర్జేడీ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా మండిపడ్డారు. ఆర్జేడీకి ఒక స్టాండ్ లేదని.. కొత్త పార్లమెంట్ భవనాన్ని శవపేటిక అని ఎలా పిలుస్తుందని ఆక్షేపించారు. అయితే కొత్త పార్లమెంట్ భవనాన్ని స్పీకర్ ప్రారంభించాల్సి ఉండేదని ఆయన అభిప్రాయ పడ్డారు.


కొత్పాత ర్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి మెజార్టీ విపక్షాలు దూరంగా ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ తో పాటు ఎన్సీపీ, టీఎంసీ, ఆప్, ఎస్పీ, కమ్యూనిస్ట్ పార్టీల వంటి 20 కి పైగా ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాదని ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడాన్ని తప్పుపడుతున్నాయి. ఇప్పటికే పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవానికి వెళ్లకూడదని.. దీనిపై 20 కి పైగా పార్టీలు ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. అయితే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతోపాటు వివిధ ప్రాంతీయ పార్టీలు మాత్రం ఈ పార్లమెంటు ప్రారంభోత్సవానికి హాజరు కావడం గమనార్హం.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa