సీఎం వైయస్ జగన్ నాలుగేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని వైయస్ఆర్సీపీ ఎంపీలు వి. విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు విడదల రజిని, కారుమూరి నాగేశ్వరరావు, కాకాణి గోవర్థన్రెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జోగి రమేష్, సీదిరి అప్పలరాజు వేర్వేరుచోట్ల స్పందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... సరిగ్గా నాలుగేళ్ల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారంతో ఏపీలో నూతన శకం ఆరంభమైందని వైయస్ఆర్సీపీ నేతలు కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ నాలుగు సంవత్సరాల పాలన పూర్తిచేసుకున్న సీఎంకు వారు అభినందనలు తెలిపారు. ఆయన సారథ్యంలో అమలవుతున్న నవరత్నాలతో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa