ఎన్టీఆర్ జిల్లా మైలవరం రాజకీయం మళ్లీ వేడెక్కింది. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీమంత్రి దేవినేని ఉమాపై ఫైర్ అయ్యారు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తనకు ఆదర్శం అంటున్న వసంత కృష్ణ ప్రసాద్.. దేవినేని ఉమా చరిత్ర ఏంటో అందరికీ తెలుసని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా దేవినేని ఉమా మైలవరం ప్రజలకు చేసిన మేలు ఏంటో చెప్పాలని వసంత కృష్ణ ప్రసాద్ డిమాండ్ చేశారు.
'ఒక్కసారి గెలిచిన కృష్ణ ప్రసాద్కు అంత బలుపా అని ఉమా మాట్లాడుతున్నారు. అవును వసంత కృష్ణ ప్రసాద్కు బలుపే. నువ్వు నాలుగు సార్లు గెలిచినా.. నీ గెలుపు ఎటువంటి గెలుపో చెప్పాలి. అన్నా వదినల బలిదానంతో నువ్వు గెలిచావు. అది గెలుపు కాదు. 2019లో మంత్రిగా ఉన్న నిన్ను.. 13 వేల ఓట్ల తేడాతో ఓడించాను. అదీ గెలుపంటే. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చెప్పినట్లు.. నేను కూడా ఎంతో కష్టపడి ఎదిగా. దేవినేని ఉమా ఎం వ్యాపారం చేశారో చెప్పాలి' అని వసంత కృష్ణ ప్రసాద్ డిమాండ్ చేశారు.
'దేవినేని కుటుంబం నందిగామ, మైలవరం నియోజకవర్గాలకు చెందిన వారు కాదు. గన్నవరం నియోజకవర్గానికి చెందిన దేవినేని కుటుంబం.. కంచికచర్లలో కూల్ డ్రింక్స్ షాప్ పెట్టుకొని బతికింది. అలా బతికిన దేవినేని ఉమా ఎలా ఐదు సార్లు పోటీ చేశారు. మంత్రి మల్లారెడ్డి లాగా పూలు అమ్మావా.. పాలు అమ్మావా.. ఇసుక, మట్టి అమ్ముకోవడం తప్ప నువ్వు ఏ వ్యాపారం చేశావో చెప్పు. దేవినేని ఉమా వైసీపీకి అనుకూల శత్రువు. దేవినేని ఉమ లాంటి నాయకుడు ఉండబట్టే.. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కకావికలం అయ్యింది' అని కేపీ సంచలన కామెంట్స్ చేశారు.
'కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఇతర నాయకులు టీడీపీని వీడి వైసీపీలో చేరడానికి కారణం దేవినేని ఉమానే. టీడీపీలో ఉన్న క్రియాశీల నాయకులు పని చేయకపోవడాని కారణం దేవినేని ఉమానే. నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు మళ్లీ ఎమ్మెల్యే కావాలన్నా.. దేవినేని ఉమా సపోర్ట్ కావాలి. దేవినేని ఉమా నియోజకవర్గానికి వచ్చినప్పుడల్లా 500 టీడీపీ ఓట్లు పోవడం ఖాయం' అని వసంత కృష్ణ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa