వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన చూసి చంద్రబాబుకు నవ నాడులు చిట్లి పోయాయని.. పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెటైర్లు వేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన రోజా.. చంద్రబాబు, టీడీపీపై విమర్శలు గుప్పించారు. పిచ్చికి పరాకాష్ట టీడీపీ ఛార్జ్ షీట్ అని ఫైర్ అయ్యారు. 600 హామీలు ఇచ్చి.. ఆరు హామీలు కూడా నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. సీఎం సంతకాలకు విలువ లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి రోజా వ్యాఖ్యానించారు.
'చంద్రబాబు లాంటి చీటర్ దేశంలో మరొకరు లేరు. ఆస్తి కోసం కుటుంబీకులను వేధించిన వ్యక్తి బోండా ఉమా. అమ్మఒడి పథకాన్ని ఎగతాళి చేసి.. ఇప్పుడు మళ్లీ ఆ పథకం ఎందుకు మేనిఫెస్టోలో పెట్టారో చంద్రబాబు చెప్పాలి. నాలుగు తరాలు గుర్తు పెట్టుకునేలా.. జగన్ నాలుగేళ్ల పాలన కొనసాగింది. 15 ఏళ్లు సీఎంగా కొనసాగి.. తీరా ఇప్పుడు మహిళలకు నెలకు 1500 ఇస్తాను అంటే.. టీడీపీని నమ్మేవారు ఎవరూ లేరు. 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పడం విడ్డూరంగా ఉంది' అని మంత్రి రోజా విమర్శించారు.
'చంద్రబాబును నమ్మి ఓటేసే రైతులు ఎవ్వరూ లేరు. టీడీపీ మేనిఫెస్టోలో ఉన్న వాటిలో మూడు వైసీపీవి, కర్ణాటక కాంగ్రెస్ నుంచి రెండు, కర్ణాటక బీజేపీ నుంచి ఒక పథకాన్ని కాపీ కొట్టారు. వారికి అనుకూలంగా లేకపోతే ఎవరి వ్యక్తిత్వంపై అయినా బురదజల్లే ప్రయత్నం చేస్తారు. అవినాష్ రెడ్డి విషయంలో.. ఇవాళ జస్టిస్ లక్ష్మణ్ వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం. అవినాష్కు వ్యతిరేకంగా ఆరోపణలు తప్ప సాక్ష్యాలు లేవని హైకోర్టు చెప్పింది. చంద్రబాబుకు మళ్లీ బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. అవినాష్ తప్పు చేసి ఉంటే నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎందుకు చర్య తీసుకోలేదు' అని రోజా ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa