ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆడుకుంటూ నీటి గుంటలో పడిపోయిన చిన్నారులు.,,,వెంటనే గుంతలోకి దూకి పిల్లలను కాపాడిన తల్లులు.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 31, 2023, 07:57 PM

నీటి గుంటలో పడిన తమ పిల్లలను రక్షించి ఇద్దరు తల్లులు దుర్మరణం పాలయ్యారు. హృదయ విదారకరమైన ఈ ఘటన నెల్లూరు నగరంలోని భగత్‌సింగ్‌ కాలనీలో బుధవారం (మే 31) చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెన్నానది రివిట్‌మెంట్‌ వాల్‌ నిర్మాణం కోసం జేసీబీతో గుంతలు తవ్వి వదిలేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో ఆ గుంతల్లో నీరు చేరాయి. బుధవారం సాయంత్రం ఆడుకుంటూ అటుగా వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తూ ఓ గుంతలో పడిపోయారు. అది గమనించిన ఆ ఇద్దరు చిన్నారుల తల్లులు షాహినా, షబీనా వెంటనే గుంత వద్దకు పరుగెత్తుకొచ్చి అందులో దూకారు. చిన్నారులను బయటకుతీసి కాపాడారు కానీ, వారిద్దరూ పైకి రాలేకపోయారు. ఆ సమయంలో వారికి సాయం చేసేందుకు కూడా అటుగా ఎవరూ రాలేదు. దీంతో బురదలో చిక్కుకుపోయి గుంతలోనే ప్రాణాలు విడిచారు.


ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది. కొంత కాలంగా అక్కడ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని.. అయితే, జేసీబీతో గుంతలు తవ్వి వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భారీ గుంతల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ విషాదం చోటు చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ పనుల్లో జాప్యం కూడా ప్రమాదానికి కారణమైందని చెబుతున్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa