ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుట్ర పూరిత రాజకీయాలు చెయ్యడం తగదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 02, 2023, 04:50 PM

ప్రొద్దుటూరులో టీడీపీ యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్రపై  వైసీపీ మూకల దాడిని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. దాడికి సంబంధించి వైసీపీపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రపై వైసీపీ కుట్ర రాజకీయం చేస్తోందని విమర్శించారు. యువగళం పాదయాత్రపై ప్రొద్దుటూరులో కోడిగుడ్ల దాడి అందులో భాగమే అని ఆరోపించారు. టీడీపీ పాలనలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ రెడ్డి వేల కిలోమీటర్లు స్వేచ్ఛగా పాదయాత్ర చేసిన విషయాన్ని సీఎం అయిన తర్వాత మరిచినట్లు ఉన్నారన్నారు. యువనేత లోకేష్ పాదయాత్రకు లభిస్తున్న అపూర్వ ప్రజాస్పందనను జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు ఇలాంటి చిల్లర పనులకు దిగజారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుల కార్యక్రమాలకు భద్రత కల్పించే విషయంలో పోలీసులు ఎంతమాత్రం శ్రద్ధ చూపడం లేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కళ్లుతెరిచి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa