ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ మాట తప్పాడు అంటున్న టీడీపీ నేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 02, 2023, 04:52 PM

జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, నేడు చేసే పనులకు పొంతనే లేదని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్  అన్నారు. శుక్రవారం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 500 మంది నాయకులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. చంద్రన్న సారధ్యంలో జరిగిన అభివృద్ది.. జగన్ పాలనలో జరిగిన అవినీతిపై ప్రజలకు వివరించేలా కార్యాచరణ రూపొందించారు. టీడీపీ మ్యానిఫెస్టోతో పాటు, జగన్  హామీలు అమలు చేయకుండా మోసం చేసిన అంశాలపై కరపత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేలా తూర్పు నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లే కార్యక్రమం చేపట్టామన్నారు. అమ్మ ఒడిపై గొప్పలు చెప్పుకుంటున్న జగన్ మాట తప్పడం నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రతి ఇంట్లో ఉన్న బిడ్డలకు అమ్మఒడి అని చెప్పి.. ఒక్కరికే పరిమితం చేశారన్నారు. చంద్రబాబు పెంచిన పెన్షన్‌ను రెండు వేల నుంచి మూడు వేలు చేస్తామన్నారని.. జగన్ నాలుగేళ్లుగా పెన్షన్ పెంచకుండా మోసం చేయడం వాస్తవం కాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రకటించిన మ్యానిఫెస్టోపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. వీటన్నింటిపైనా అవగాహన కల్పించేలా ఐదు వందల మంది నాయకులతో సమావేశం పెట్టామని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణ పాలన, జగన్ అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరిస్తామని ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa