అమరావతిలో జరిగిన పాపాలకు కారణం ఎవరు? బీజేపీ కాదా.. అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. కర్నూలులో హైకోర్టు పెడతామని హామీ ఇచ్చిన బీజేపీ.. ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదని జేపీ నడ్డాను ప్రశ్నించారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, సత్యకుమార్, మాటలు నమ్మి మాట్లాడితే.. అది వారి కర్మ అని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం గురించి జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.
'ల్యాండ్ స్కామ్ అంటే విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణలో ఉంటుంది. మీపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్తే బాగుంటుంది. పేదలకు నేరుగా రూ.2.16 లక్షల కోట్లను అందించిన ఘనత జగన్ది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇందులో సగం డబ్బయినా ఇచ్చారా? కర్ణాటకలో జనం ఊసిన ప్రభుత్వం మీది కాదా? పచ్చ పువ్వులతో నిండిన బీజేపీ కాస్త ఇప్పుడు టీజేపీగా మారింది. అసలు రాష్ట్ర విభనకు బీజం వేసింది బీజేపీ కాదా' అని పేర్ని నాని ప్రశ్నించారు.
'రాజధాని నిర్మాణానికి డబ్బులిస్తే.. చంద్రబాబు దోచేశారని మీరు ఆరోపించారు. ఇసుక ఫ్రీ అంటూ టీడీపీ, బీజేపీ పెద్దలు దోచుకున్నారు. మీరు భాగస్వామిగా ఉన్న ప్రభుత్వంలో.. రూ.4 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? ఇసుక డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో నడ్డాకే తెలియాలి. మా ప్రభుత్వ చర్యలతో మద్యం అమ్మకాలు భారీగా తగ్గాయి. మద్యం అమ్మకాలు తగ్గించేందుకు రేట్లు పెంచాం. గత టీడీపీ ప్రభుత్వం లిక్కర్ షాపులను ఇద్దరికే కట్టబెట్టింది. లిక్కర్ సిండికేట్ను దందాగా నడిపింది మీరు కాదా?. ఇకపై నిజాలు తెలుకొని మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే.. మేము కూడా మా స్టైల్లో సమాధానం చెబుతాం' అని పేర్ని నాని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa