ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమిత్ షా ఏపీకి ఎందుకొచ్చారు.... మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 12, 2023, 07:34 PM

వైసీపీని విమర్శించడానికే అమిత్ షా విశాఖకు వచ్చినట్టున్నారని.. మంత్రి కారుమూరి నాగేశ్వర రావు వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి, విశాఖ రైల్వే జోన్, మెట్రోరైలు వంటి అంశాలపై అమిత్ షా ఎందుకు మాట్లాడలేదన్నారు. రాష్ట్రానికి సంబంధించి ఏం మాట్లాడకపోయినా.. టీడీపీ, బీజేపీ నేతలు చప్పట్లు కొట్టేస్తున్నారని కారుమూరి నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు.


'కేంద్ర మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలన్నీ అవాస్తవాలే. మీవాళ్లే మిమ్మల్ని అభాసుపాలు చేశారు. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. అమిత్ షా మాట్లాడిన సభలో.. విశాఖ రైల్వే జోన్, స్టీల్‌ ప్లాంట్‌ ప్రస్తావన ఏదీ.. అమిత్‌షా ఎందుకు మాట్లాడలేదు. టీడీపీ నేతలు చెప్పిన మాటలనే అమిత్‌షా మాట్లాడారు. గతంలో చంద్రబాబు, టీడీపీ నేతలు నరేంద్రమోదీని వ్యక్తిగతంగా విమర్శించలేదా? అమిత్‌షా తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడు టీడీపీ నేతలు రాళ్లతో దాడి చేయించలేదా? బీజేపీ సభా వేదికపై ఉన్నవారంతా ఎవరు?..టీడీపీ వారు కాదా?' అని కారుమూరి ప్రశ్నించారు.


'టీడీపీ హయాంలో జరిగిన కుంభకోణంపై బీజేపీ నేతలు ఎప్పుడైనా మాట్లాడారా? టీడీపీ చెప్పుడు మాటలనే అమిత్‌షా వ్యాఖ్యానించారు. ఎవరో ఏదో చెబితే మాట్లాడేసి వెళ్లిపోవడం సరికాదు. టీడీపీ పచ్చి అబద్ధాలతో రాజకీయ పబ్బం గడుపుకుంటుంది. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా సీఎం జగన్‌ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా సీఎం జగన్‌ పరిపాలన సాగిస్తున్నారు' అని మంత్రి కారుమూరి నాగేశ్వర రావు వ్యాఖ్యానించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa