ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాలో ఉన్నది సీమ రక్తమే.... నారా లోకేశ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 12, 2023, 10:03 PM

"వైసీపీ నాయకులు నన్ను సీమలో అడుగుపెట్టనివ్వం అని సవాల్ చేశారు... కానీ నాలో ఉన్నదీ సీమ రక్తమేరా సిల్లీ ఫెలోస్..." అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు.  నారా లోకేశ్ కడప జిల్లా బద్వేలులో నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సభలో నారా లోకేశ్ వాడీవేడిగా ప్రసంగించారు. బద్వేల్ జోష్ అదిరిపోయిందని, మట్లి రాజులు ఏలిన నేల బద్వేల్ అని పేర్కొన్నారు. మహానగరం అయ్యే శక్తి బద్వేలుకి ఉంది అని బ్రహ్మం గారు చెప్పారని వెల్లడించారు. 


శ్రీ కొండ గోపాలస్వామి దేవాలయం, చెన్నకేశవస్వామి దేవాలయం, కాశిరెడ్డి నాయన ఆలయం ఉన్న నేల బద్వేల్ అని వివరించారు. బద్వేల్ పెద్దాయన బిజివేముల వీరారెడ్డి గారు... కడప జిల్లాలో పసుపు జెండా ఎగరేసిన మొనగాడు... ఆయన రికార్డులు కొట్టే వారు ఎవరూ లేరు అని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఎంతో ఘనచరిత్ర ఉన్న బద్వేల్ గడ్డపై పాదయాత్ర చెయ్యడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. 


"వైసీపీ నాయకులు నన్ను సీమలో అడుగుపెట్టనివ్వం అని సవాల్ చేశారు... కానీ నాలో ఉన్నదీ సీమ రక్తమేరా సిల్లీ ఫెలోస్..." అని లోకేశ్ ఘాటుగా జవాబిచ్చారు. సవాల్ చెయ్యాలంటే హిస్టరీ ఉండాలి... అడ్డుకోవాలి అంటే దమ్ముండాలి... ఆ రెండూ వైసీపీ నాయకులకు లేవని ఎద్దేవా చేశారు. క్లైమోర్ మైన్లకే భయపడని కుటుంబం మాది... కోడికత్తి బ్యాచ్ కి భయపడతామా? అడ్డొచ్చిన వైసీపీ సైకోలను సీమ సందుల్లో తొక్కుకుంటూ పోయాం అని వెల్లడించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa