జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర దిగ్విజయం కావాలని కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం రెడ్డి పల్లె లో వెలసిన ఆంజనేయ స్వామి ఆలయంలో కోడూరు జనసేన నాయకుడు వర్దనగారి ప్రసాద్ ఆధ్వర్యంలో రాజంపేట మరియు కోడూరు జనసేన నాయకులు అభిమానులు కార్యకర్తల సమక్షంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధించి రాష్ట్రంలో అరాచక పరిపాలన, నియంతృత్వ నాయకత్వం మారి ప్రజాస్వామ్య పరిరక్షణ , ధర్మ సంస్థాపనతో వ్యవస్థలను బలోపేతం చేస్తూ సరికొత్త నాయకత్వంతో ప్రజా ప్రభుత్వాన్ని జనసేన పార్టీ ఏర్పాటు చేయాలని వారు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa