మడమ తిప్పుడులో ఏపీ సీఎం జగన్ని కరకట్ట కమల్ హాసన్ మించిపోయాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విటర్ వేదికగా తెలిపారు. ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేకుండా యూ1 జోన్ రద్దు చేస్తున్నామంటూ హామీ ఇచ్చి జగన్ ప్రభుత్వం తాడేపల్లి రైతుల్ని మోసం చేసిందన్నారు. రైతులకు ఆందోళన పడొద్దని సూచించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేకుండా యూ1 జోన్ను రద్దు చేస్తామన్నారు. ఈ లోపు తొందర పడి డబ్బులు కట్టొద్దని నారా లోకేష్ సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa