ట్రాన్స్జెండర్లకు రాజమహేంద్రవరం జిల్లా న్యాయసేవాధికార సంస్థలో వారి హక్కులపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎల్ఎస్ఏ కార్యదర్శి ప్రత్యూషకుమారి మాట్లాడుతూ... వారి గౌరవానికి భంగం కలిగించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ట్రాన్స్జెండర్లు వారి హక్కులు, సంక్షేమ పథకాలపై అవగాహన కలిగి ఉండా లని సూచించారు. ట్రాన్స్జెండర్లకు పోలీస్ శాఖ తరపున సహాయ సహకారాలు అందిస్తామని అడిషనల్ ఎస్పీ జి.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రాన్స్జెండర్లకు అమలులోవున్న సంక్షేమ పథకాల గురించి దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ బి.రామ్ కుమార్, డీఏపీసీయు ప్రోగ్రాం మేనేజర్ ఆదిలింగం తెలిపారు. ట్రాన్స్జెండర్లు ఆర్థికం గా బలపడేందుకు రుణాలందిస్తామని మెప్మా ప్రాజెక్టు మేనేజర్ కె.మోహన్ కుమార్ చెప్పారు. అనంతరం ట్రాన్స్జెండర్లకు డీఎల్ఎస్ఏ కార్యదర్శి ప్రత్యూష కుమారి గుర్తింపు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ జె.మహేశ్, దిశ డీఎస్పీ కె.తిరుమలరావు,డీఆర్డీఏ ప్రాజెక్టు మేనేజర్ మాలతి పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa