ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరణించిన ఏనుగులను ఖననం చేసిన అధికారులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 16, 2023, 02:06 PM

చిత్తూరు జిల్లా, పలమనేరు సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం రాత్రి మినిలారీ ఢీకొని మృతిచెందిన మూడు ఏనుగులకు గురువారం పోస్టుమార్టం జరిగింది. ఎస్వీ జూపార్కు నుంచి వచ్చిన డాక్టర్‌ తోయబ్‌ సింగ్‌, సిబ్బంది ఈ పోస్టుమార్టం చేశారని రేంజర్‌ శివన్న తెలిపారు. గాంధీనగర్‌ అటవీ ప్రాంతంలో ఆ ఏనుగులను ఖననం చేయించారు. మూడు ఏనుగుల మృతికి కారకుడైన మినీలారీ డ్రైవరు మంజునాథను గురువారం అరెస్టుచేసినట్లు రేంజర్‌ శివన్న తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవరు పారిపోయి సమీపంలోని కల్వర్టుకింద దాక్కొన్నాడన్నారు. లారీ యజమానికి సమాచారం ఇవ్వడంతో.. ఆయన ప్రమాద స్థలానికి చేరుకొన్నాడని తెలిపారు. అతడి ద్వారా డ్రైవరు ఆచూకీ తెలుసుకొని అరెస్టు చేశామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa