ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 16, 2023, 02:06 PM

కర్నూలు నగరంలో కృష్ణానగర్‌ కోట్ల రైల్వేస్టేషన్‌ సమీపంలో గురువారం రైలు ఢీకొని దుర్గాప్రసాద్‌ (14) దుర్మరణం చెం దాడు. కృష్ణానగర్‌ తారకరామనగర్‌ కాలనీకి చెందిన దుర్గాప్రసాద్‌ బీ.క్యాంపు ఉన్నత పాఠశాలలో రెండు రోజుల కిందటనే పదో తరగతిలో చేరాడు. తండ్రి చైతన్య, తల్లి ధనలక్ష్మి కూలి పనులు చేస్తుంటారు. గురువారం సాయంత్రం రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్తుండగా వేగం గా వచ్చిన రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాల య్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వెళ్లేలోపు బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రైల్వే ఎస్‌ఐ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa