కాకినాడ జిల్లా నుంచి వారాహి యాత్రకు శ్రీకారం చుట్టిన పవన్ కల్యాణ్ రెండోరోజైన గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ వర్గాల సమస్యలను ఆలకిస్తూ వారికి భరోసా ఇస్తూ ముందుకు కదిలారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ను కలవడానికి వచ్చిన అనేకమంది సమస్యలను ఓపిగ్గా విన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి నియోజకవర్గవ్యాప్తంగా అనేకమంది గొల్లప్రోలుకు బారులు తీరారు. ప్రతి అర్జీదారుడి పేరు, ఊరు తెలుసుకుని అందరి సమస్యలను క్షుణ్ణంగా విన్నారు. ప్రతి అర్జీని లోతుగా పరిశీలిం చారు. తాటిపర్తిలో చెరువును ఎమ్మెల్యే ద్వారంపూడి, బీమాస్ రెడ్డి అడ్డంగా తవ్వేస్తున్నారని పలువురు అర్జీదారులు వినతిప త్రం ఇవ్వగా ఎప్పటినుంచి ఎంతలోతుకు తవ్వారు? అనుమతులు ఉన్నాయా? లేకపోతే అధికారులు ఏంచేస్తున్నారు? అంటూ అన్నీ అడిగి తెలుసుకున్నారు. ఉప్పాడలో సముద్రం కోతపై వచ్చిన అర్జీలకు దీనికి శాశ్వత పరిష్కారం ఏంటీ అని ఆరాతీశారు. కాకినాడసెజ్, దివిస్ కంపెనీలు కాలుష్య పరిశ్రమలు పెడుతున్నాయని, కాలుష్యం బారిన పడతామని వచ్చిన అర్జీదారులతో ఎంత కాలుష్యం వస్తుంది? దాని ప్రభావం ఏంటి అంటూ లోతుగా ఆరా తీశారు. జయలక్ష్మీ సొసైటీ బ్యాంకు బోర్డు తిప్పేసిన నేపథ్యంలో దాని వెనుక కుంభకోణంపైనా ఆరా తీశారు. ఏలేరు రిజర్వాయరు ఆధుని కీకరణకోసం భూములు తీసుకుని పరిహారం రాలేదని చెప్పిన బాధి తుల సమస్యలను ఆలకించారు. అటు దివ్యాంగులు సైతం తమ బాధలు వినిపిస్తే ఏయే సంక్షేమ పథకాలు ఆపేశారని తెలుసుకుని సమస్యపై పోరాడతానని ధైర్యం చెప్పారు. మొత్తం జనవాణికి 34 అర్జీలు రాగా, మరికొన్ని నేరుగా తీసుకున్నారు. తర్వాత ఉదయం పది గంటలకు పవన్ పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని వివిధ రం గాల ప్రముఖులతో భేటీ నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన వ్యూహాలపైనా వారితో చర్చించారు. ఆ తర్వాత రెండు గంటలకు పార్టీ వీరమహిళలతో భేటీ అయ్యారు. బాగా పనిచేస్తున్నారని, ఎన్ని కలు దగ్గరపడుతున్న సమయంలో వైసీపీ అరాచకాలపై ఇంకా మరింత ఉద్యమం చేయాలని దిశానిర్దేశం చేశారు. సాయంత్రం ఆరు గంటలకు చేబ్రోలులోని పట్టు గూళ్ల తయారీ కేంద్రానికి పవన్ వెళ్లారు. అక్కడ వందలాది మంది పట్టురైతులు తమ ఆవేదనను పవన్కు వివరించారు. మూడేళ్ల నుంచి ప్రోత్సాహక నిధులు ఇవ్వ లేదని కొందరు, జగన్ సీఎం అయిన తర్వాత కూడా తమకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని వివరించారు. జనసేన ప్రతి సమస్య పైనా పోరాడుతుందని ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అంతే కాదు ఈసారి వారాహి యాత్రలో ప్రతిచోటా స్థానిక సమస్యలపై పవన్ దృష్టిపెట్టడమే కాకుండా జనసేన అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది కూడా పవన్ స్పష్టంగా వివరిస్తున్నారు. జనసేన వస్తే పోలవరం పూర్తిచేస్తామని తొలిరోజు సభలో పవన్ ప్రకటించారు. గురువారం పట్టురైతుల ముఖాముఖీలో మాట్లాడుతూ గొల్లప్రోలు మండలం చేబ్రోలును సిల్క్సిటీగా మార్చుతామని ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa