ప్రొఫెసర్ హరగోపాల్పై దేశ ద్రోహం కేసు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని.. అయితే హరగోపాల్ ఒక ప్రొఫెసర్ ఆయనకు ఎవరితో సంబంధాలు లేవని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. హరగోపాల్పై కేసు పెట్టడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పని చేసిన వ్యక్తి హరగోపాల్ అని అన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ జోక్యం చేసుకొని హరగోపాల్పై ఎలాంటి కేసు లేకుండా చూడాలన్నారు. కేసీఆర్ను ఉద్యమ ద్రోహిగా చూడాల్సి ఉంటుందన్నారు. వరవరరావుపై కూడా ఇలానే దేశద్రోహం కేసు పెట్టారని.. ఆయనను జైల్లో వేశారని మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే బీహార్లో జరిగే విపక్షాల మీటింగ్ కేసీఆర్, జగన్, చంద్రబాబు నాయుడు హాజరుకావాలన్నారు. గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ పుదుచ్చేరిలో మహిళలకు పబ్బులకు పర్మిషన్ ఇచ్చారని తెలిపారు. తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానం రాలేదని గవర్నర్ అన్నారని.. మరి పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్టప్రతిని ఎందుకు పిలవలేదు అంటే గవర్నర్ దగ్గర సమాధానం లేదన్నారు. ఏదో జగన్ ప్రభుత్వంపై బీజేపీ మాట్లాడాలి కాబట్టి మాట్లాడారన్నారు. మోడీ ప్రభుత్వానికి జగన్ కట్టుబానిస ఆయనను ఎందుకు వదులుకుంటారని ప్రశ్నించారు. సీపీఐ వచ్చే ఎన్నికల్లో ఎవరితో వెళ్ళాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని నారాయణ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa