సెంట్రల్ జీఎస్టీతో పోలిస్తే ఏపీలో 4 శాతం మేర అదనంగా పన్ను వసూళ్లు అయ్యాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... పాలన రాదు, ఆదాయం లేదు అంటూ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యలు చేశారు. పాలన రాకపోతే గడచిన నాలుగేళ్లుగా పన్ను వసూళ్లు పెరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో రహదారులు అన్ని బాగుంటే ఎక్కడో దెబ్బ తిన్న ఒక్క రోడ్డు గురించి మీడియా రాస్తోందని మండిపడ్డారు. గతంలో కంటే మెరుగ్గా రహదారులపై ప్రభుత్వం వ్యయం చేస్తోందన్నారు. ఎప్పుడో ఒకసారి మాత్రమే వేతనాలు ఆలస్యం అయ్యాయి అంతే అని చెప్పుకొచ్చారు. కోవిడ్ కష్టాలు ఉన్నప్పటికీ ఎక్కడా సామాజిక పెన్షన్లు ఆలస్యం కాలేదన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు, యనమల తలో మాట మాట్లాడుతున్నారని.. ఆర్థిక పరిస్థితిపై వారిద్దరితోనూ బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. పథకాలు ఇస్తే ఉచితాలు అంటున్నారని.. టీడీపీ ఇచ్చిన హామీలు ఊచితాలు కావా తమకంటే ఎక్కువ ఇస్తామని ఇప్పుడు చెబుతున్నారని మంత్రి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa