గుడివాడ పర్యటనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. గుడివాడలో టిడ్కో ఇళ్ల పరిశీలనకు వస్తున్న సందర్భంగా లబ్ధిదారులు నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం గుడివాడలో ఏర్పాటు చేసిన హెలిపాడ్లో సీఎం దిగుతుండగా మహిళలు నిరసన తెలియజేశారు. గో బ్యాక్ సైకో సీఎం అంటూ నల్ల బెలూన్లను మహిళలు వదిలారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మహిళలను అడ్డుకున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్లు చేశారు. అయితే పోలీసుల వలయాన్ని చేధించుకుని మరీ మహిళలు టిడ్కో ప్రాంగణంలోని హెలిపాడ్ వద్ద నిరసనకు దిగారు. తొలగించిన 1600 మంది టిడ్కో లబ్ధిదారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మౌలిక వసతులు లేకుండా సీఎం ప్రారంభించిన ఇళ్లలో ఎలా నివాసం ఉంటారని మహిళలు ప్రశ్నిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa