రాష్ట్రంలో వైసీపీ నాయకులు పంచభూతాలను మింగేశారని అన్నారు. ప్రజల ఇళ్లపైనా ఈ రాక్షసులు పడతారు అని నేను చెపితే ముందుగా అంతా నమ్మలేదని, కానీ ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతోంది కదా అని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖలో జరిగిన వైసీపీ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వైజాగ్ లో నేటి పరిస్థితులకు ఒక ఉదాహరణ అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హుద్ హుద్ ను సైతం తట్టుకున్న విశాఖ, నేడు అక్రమార్కులకు విలవిల్లాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యక్తులను, ప్రజలను భయపెట్టి జగన్ ఇంతకాలం పాలన చేశాడని చంద్రబాబు అన్నారు.
అయితే ఇప్పటి వరకు జనం అన్నీ భరించారు... ఇప్పుడు ఎదురు తిరుగుతున్నారు... తిరుగుబాటు మొదలైంది అని స్పష్టం చేశారు. ఇక రానున్న రోజుల్లో వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేయడమే మిగిలి ఉంది అన్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు, నియంత కిమ్ జంగ్ సోదరుడిలా రాష్ట్రంలో సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. పులివెందులలో జగన్ భయపెట్టి గెలుస్తున్నారని, కానీ కుప్పంలో ప్రజల అభిమానంతో తాను గెలుస్తున్నానని గర్వంగా చెప్పారు.
కుప్పంలో నేడు అన్ని అభివృద్ది పనులు నిలిపివేసింది వాస్తవం కాదా అని టీడీపీ అధినేత ప్రశ్నించారు. దెబ్బతిన్న రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టాల్సిన బాధ్యత సీనియర్ నేతగా తనపై ఉందని చంద్రబాబు చెప్పారు. 4 దశాబ్దాలుగా నన్ను ప్రజలు ఆదరిస్తున్నారు... రాష్ట్రాన్ని గాడిన పెట్టి వారి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అందరిలా భయపడి నేను రాష్ట్రాన్ని వదిలేస్తే, రాష్ట్రం పూర్తిగా నాశనం అవుతుందని, అలాంటి పరిస్థితి వస్తే ఎక్కువ బాధపడేది తానే అని చంద్రబాబు నాయుడు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa