ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేద ప్రజల మీద టీడీపీకి ప్రేమ లేదు...మంత్రి ఆదిమూలపు సురేశ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 16, 2023, 06:17 PM

పేద ప్రజల మీద టీడీపీకి ప్రేమ లేదని, ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకోవడానికి కోర్టుకు వెళ్లారని మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆరోపించారు. ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ మేలు చేస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.  సీఎం జగన్‌ సంకల్పం ముందు ఆ కుట్రలు కొట్టుకుపోయాయని, దుష్టశక్తుల శక్తులన్నీ పటాపంచలయ్యాయని అన్నారు.


శుక్రవారం కృష్ణా జిల్లా గుడివాడలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవంలో ఆదిమూలపు సురేశ్ మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని చంద్రబాబు గాలికి వదిలేశారని ఆరోపించారు. ఆయన హయాంలో జరిగిన దోపిడీని ఎల్లో మీడియా ప్రశ్నించదని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయాలకు కాలం చెల్లిందని, ఆయనో ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అని రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పారు.


అన్ని హంగులతో టిడ్కో ఇళ్లను సీఎం జగన్‌ పూర్తి చేశారని మంత్రి సురేశ్ చెప్పారు. నాయకుడు ఎలా ఉంటాడనే దానికి ఉదాహరణ జగన్‌ అని పొగడ్తలు కురిపించారు. జగన్‌ ప్రభంజనంతో పచ్చపార్టీలో వణుకు పుడుతోందని చెప్పారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa