ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తవ్వకాలలో బయటపడ్డ పురాతన నాణేలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 16, 2023, 06:20 PM

ఇటీవల ఏపీలో పలు తవ్వకాలలో పురాతన వస్తువులు బయటపడుతూ వస్తున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో ఓ ఇంటి కోసం పునాదులు తవ్వుతుంటే ఓ లోహపు పాత్ర బయటపడింది. అందులో పురాతన నాణేలు లభ్యమయ్యాయి. కర్నూలు జిల్లా హోళగుంద మండలం ఎల్లార్తి గ్రామంలో నివసించే శరణ బసప్ప కొత్త ఇంటిని నిర్మించుకునే ప్రయత్నంలో పునాదులు తవ్విస్తున్నాడు. కొంత లోతుగా తవ్విన తర్వాత ఓ చిన్న బిందె వంటి పాత్ర కనిపించింది.


దీనిపై సమాచారం అందుకున్న అధికారులు శరణ బసప్ప ఇంటి వద్దకు వచ్చి ఆ బిందెను స్వాధీనం చేసుకున్నారు. ఆ బిందెలో ఏం ఉన్నాయో అని అందరూ ఆసక్తిగా చూశారు. అందులో బ్రిటీష్ పాలన కాలం నాటి వెండి, రాగి నాణేలు కనిపించాయి. అవి 1897, 1900 సంవత్సరంలో ముద్రితమైన నాణేలు అని గుర్తించారు. వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa