కొందరి ప్రవర్తన ఆశ్చర్యంగాను.. నమ్మశక్యం కానట్టుగా ఉంటుంది. ఇదే క్రమంలో ఉత్తరప్రదేశ్ మైన్పురి జిల్లాకు చెందిన ఓ బాలుడి ప్రవర్తన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. తన అమ్మమ్మే గతజన్మలో తన భార్య అని చెబుతున్న బాలుడు..తల్లి, మేనమామలు తన సంతానమని చెప్పుకొచ్చాడు. రతన్పూర్ గ్రామానికి చెందిన మనోజ్ మిశ్రా 2015 జనవరి 9న మరణించారు. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఆయన పాముకాటుకు గురై దుర్మరణం చెందారు. అప్పటికి మనోజ్ కుమార్తె రంజన గర్భంతో ఉంది. తండ్రి పోయిన 20 రోజులకు ఆమెకు కొడుకు పుట్టాడు. అతడికి ఆర్యన్ అని పేరు పెట్టారు.
అయితే, జూన్ 15 నుంచి ఆర్యన్ వింతగా ప్రవర్తించడం ప్రారంభించాడు. ఆ రోజు అమ్మమ్మ ఇంట్లో ఉన్న అతడు తాను మనోజ్ అని చెప్పడం ప్రారంభించాడు. ఇది చూసిన బాలుడి మేనమామలు, అమ్మమ్మ కన్నీరుమున్నీరయ్యారు. ఇక బాలుడు తన పేరిట బ్యాంకులో డబ్బులు ఉన్నాయని కూడా చెప్పాడు. దీంతో, బాలుడి ప్రవర్తన స్థానికంగా చర్చనీయాంశమైంది. తాతయ్యే మళ్లీ బాలుడిగా పుట్టాడా? అంటూ జనాలు కథలుకథలుగా చెప్పుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa