ప్రకాశం జిల్లా, దొనకొండ , బాదాపురం గ్రామ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదంలో పదోతరగతి విద్యార్థి దుర్మరణం చెందిన సంఘటన జరిగింది.వివరాల్లోకి వెళ్ళితే.. దొనకొండ మండలంలోని పోలేపల్లికి చెందిన ఈర్ల బాలవెంకటేశ్వర్లు(15) దొనకొండ జడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం దొనకొండ హాస్టల్లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. తిరిగి దొనకొండ నుంచి సొంతూరు వెళ్లే క్రమంలో స్నేహితుడైన చందవరం గ్రామానికి చెందిన వెంకటలక్ష్మణ్ను ఎక్కించుకొని వేగంగా వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న బాలవెంకటేశ్వర్లు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో వ్యక్తి లక్ష్మణ్ తీవ్రగాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెలుగొండయ్య, ప్రసాదరావులు హుటాహుటిన సంఘటన ప్రదేశానికి చేరుకొని లక్ష్మణ్కు ప్రథమ చికిత్స నిర్వహించి మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa