వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఉమ్మడి ఎదుర్కొవడానికి ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాల్లో శుక్రవారం కీలక ముందడుగు పడింది. కూటమి ఏర్పాటులో భాగంగా ప్రతిపక్ష నేతలు పట్నాల్లో సమావేశమవుతున్నారు. ఇందుకోసం ప్రముఖ నేతలు పట్నాకు చేరుకున్నారు. 2024 లోక్సభ ఎన్నికల రోడ్మ్యాప్పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో ఈ భేటీ జరుగుతోంది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే), డీఎంకే, జేఎంఎం, సమాజ్వాదీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఐ, సీపీఎం, జేడీయూ, ఆర్జేడీలు సమావేశానికి హాజరయ్యాయి
అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం అధికారుల నియామకాలు, బదిలీలపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సు విషయంలో కాంగ్రెస్ తమకు మద్దతుగా నిలవకపోతే ప్రతిపక్షాల సమావేశాన్ని బహిష్కరిస్తామని ఆప్ అల్టిమేటం జారీచేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఇటువంటి అంశాలను పార్లమెంట్ సమావేశాలకు ముందు నిర్ణయిస్తామని స్పష్టం చేశారు.
‘దాన్ని వ్యతిరేకించడం లేదా ప్రతిపాదించడం బయట జరగదు.. పార్లమెంటులో జరుగుతుంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు అన్ని పార్టీలు కలిసి పని చేయాలనే అంశాలపై నిర్ణయం తీసుకుంటాయి.. అది వారికి తెలుసు, వారి నాయకులు కూడా మన అఖిలపక్ష సమావేశాలకు వస్తుంటారు. బయట ఇంత ప్రచారం ఎందుకు జరుగుతుందో తెలియదు’ అని ఖర్గే స్పష్టం చేశారు. అటు, ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు, , సీపీఐ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీతోపాటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, అఖిలేశ్ యాదవ్, ఉద్ధవ్ ఠాక్రేలు హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa