అగ్రిగోల్డ్ బాధితుల ఆర్తనాదాలు సీఎం జగన్ చెవికి చేరడం లేదా అని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు ప్రశ్నించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ఆరు మాసాల్లో ఇరవై లక్షల మందికి రూ.3986 కోట్లు వడ్డీతో సహా చెల్లిస్తామని జగన్ హామీ ఇచ్చారని.. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయినా ఇంతవరకు స్పందన లేదని విమర్శించారు. కేవలం రూ.906 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ బాధితులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. చంద్రబాబు నాడు మూడు లక్షలు ఇస్తానంటే.. జగన్ పది లక్షలు పూలల్లో పెట్టి ఇస్తానన్నారని గుర్తుచేశారు. మరి జగన్కు నేటి వరకు పూలు దొరకలేదా.. డబ్బులు రాలేదా చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు బాధితులను ఆదుకునే ఉద్దేశం జగన్కు ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. ఈనెల 20న బాధితులంతా సమావేశమై ఆగష్టు 15న డెడ్ లైన్ పెట్టారని తెలిపారు. స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా అయినా జగన్ బాధితులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa