తెలుగు దేశం పునాదులు గురించి మాట్లాడటం జగన్ అవివేకమని మాజీ మంత్రి జవహర్ వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... అనంతపురం డొక్కల కరువు దగ్గర నుంచి దివిటి దొంగల వరకు ఒకటైతే... క్వారీ ఆక్రమణలు సజీవ దహనాలు మరోవైపన్నారు. 1994 నుంచి నేటి వరకు ఇంత డబ్బు ఎక్కడిది జగన్ అంటూ ప్రశ్నించారు. స్వతంత్ర్య సమరయోధుల కుటుంబం నుంచి ఏమీ రాలేదని.. అమాయకుల రక్తంతో తడిసిన పునాదులతో జగన్ సామ్రాజ్యం ఏర్పడిందని విమర్శించారు. సాక్షి టీవి, సాక్షి పత్రిక యాజమాని భారతి కాదా? అని ప్రశ్నించారు. అమ్మ ఒడి పంచుతానంటూ అసత్యాలు ఎలా చెపుతారని నిలదీశారు. ఇంటికి ఒకరికి ఇచ్చి రెండో బిడ్డ ఏమి చేయాలన్నారు. విదేశి విద్య లేదు పీజీ విద్య లేదని.. జగన్ మాట మార్చి పేదల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. సంక్షేమాన్ని పరిచయం చేసిన తెలుగు దేశాన్ని విమర్శించటం మానుకోవాలని హితవుపలికారు. పత్రికలు మీడియాపై పడి ఏడవటం జగన్ మానుకోవాలన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించిన జగన్ ప్రజాస్వామ్యంపై మాట్లాడే అర్హత లేదని జవహర్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa