ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తేనెటీగల దాడిలో మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 28, 2023, 05:23 PM

నంద్యాల జిల్లాలోని బేతంచెర్లలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి  తృటిలో పెను ప్రమాదం తప్పింది. బుగ్గన పర్యటనలో ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. అయితే బుగ్గనను సెక్యూరిటీ సిబ్బంది కాపాడారు. బుధవారం కనుమకింద కొట్టాల సమీపంలో ఉన్న ఎర్రజాల గుహల అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించేందుకు రాగా... ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో 40 మందికి పైగా గాయాలయ్యాయి. తేనెటీగలు దాడి చేసేందుకు వచ్చిన వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది మంత్రిని అక్కడి నుంచి తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే తేనెటీగల దాడిలో సీఐ ప్రియతం రెడ్డి, ఎస్సై శంకర్ నాయక్, ప్రభుత్వ ఇంజినీర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన బేతంచెర్ల ఆస్పత్రికి తరలించారు. ముద్దవరం పంచాయతీ సెక్రటరీ నాయక్‌పై తేనెటీగలు తీవ్రంగా దాడి చేయడంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తతో మంత్రి బుగ్గన ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa