సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయో లేదో తెలుసుకునేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూపకల్పన చేశారని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండల పరిధిలోని పెసర్లంక గ్రామంలో బుధవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున ఇంటింటికి వెళ్లి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను కరపత్రాల ద్వారా వివరించి అందించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ దే అన్నారు. కార్యక్రమంలో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ దేవినేని మల్లిఖార్జునరావు, ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, వలేంటీర్లు, పార్టీ వివిధ శ్రేణుల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa