శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామంలో గల శ్రీ గురుదేవా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు రాపర్తి జగదీష్ బాబు సుమారు 2వేల మంది భక్తులతో కలసి పాదయాత్రగా సింహాచలం వెళ్లి శ్రీ వరాహ వేంకట లక్ష్మీనరసింహస్వామిని బుధవారం దర్శించుకున్నారు. సింహాద్రి అప్పన్న దర్శనానికి కాలినడకన మంగళపాలెం నుండి బయలుదేరిన జగదీష్ బాబు ఆయన భక్త బృందం పెందుర్తి, వేపగుంట మీదుగా సింహాచలం చేరుకుని, స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా జగన్నాథస్వామి రథయాత్ర మరుసటి రోజున పాదయాత్రగా సింహాచలంలో కొలువైన శ్రీ సింహాద్రి అప్పన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందని ఆయన తెలిపారు. ప్రతి ఏటా కాలినడకన వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం వలన తమ ప్రాంతంలో పాడిపంటలు సమృద్ధిగా పండుతాయని, ప్రజల సుఖసంతోషాలతో ఉంటారని ప్రగాఢ విశ్వాసాన్ని ఆయన వ్యక్తపరిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa