ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే నెలలో విజయనగరం లో టీడీపీ భరోసా యాత్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 30, 2023, 01:59 PM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన వివిధ హామీలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఉత్తరాంధ్రలో చేపట్టనున్న భవిష్యత్తుకు భరోసా బస్సు యాత్ర విజయనగరం నియోజకవర్గంలో జూలై 4న ప్రారంభం కానుంది. అనంతరం యాత్ర నెల్లిమర్ల, చీపురుపల్లి, రాజాం, గజపతినగరం, బొబ్బిలి, ఎస్‌.కోట నియోజకవర్గాల్లో కొనసాగనుంది. ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రులు, ఇతర ముఖ్య నాయకులు బస్సు యాత్రలో పాల్గొంటున్నారు. టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌గజపతిరాజు కూడా హాజరవుతారు. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, అరాచక పాలన, మహిళలపై దాడులను గుర్తుచేస్తూ టీడీపీ అధికారంలోకి వస్తే యువత, మహిళలు, రైతులతో పాటు వివిధ వర్గాలకు ఏమి చేస్తామన్న విషయాన్ని మాజీ మంత్రులు బస్సు యాత్ర ద్వారా వివరించనున్నారు. పార్టీ నగర అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాదుల లక్ష్మీవరప్రసాద్‌, ఆల్తి బంగారుబాబు, మండల అధ్యక్ష, కార్యదర్శులు బొద్దల నర్సింగరావు, గంటా పోలినాయుడుతో పాటు టీడీపీ సీనియర్‌ నాయకులు బస్సు యాత్ర ఎక్కడెక్కడ నిర్వహించాలన్న రూట్‌ మ్యాప్‌పై చర్చిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa