ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీపై క్రికెటర్ అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఇటీవలే వైఎస్ జగన్మోహన్రెడ్డితో అంబటి రాయుడు భేటీ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని.. వైసీపీలో చేరడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్తో భేటీ వెనుక గల అసలు సీక్రెట్ ఏంటో అంబటి రాయుడు రివీల్ చేశాడు.
కేవలం క్రీడల గురించి మాట్లాడేందుకే తాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశానని అంబటి రాయుడు స్పష్టం చేశాడు. రాష్ట్రంలో క్రీడా అకాడమీలు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ చెప్పారని.. తాను కూడా క్రీడా రంగంలో తన వంతు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. ఇటీవలే ఐపీఎల్కు గుడ్బై చెప్పిన అంబటి రాయుడు.. ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నాడు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించాడు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై అంబటి రాయుడు ప్రశంసలు కురిపించాడు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం బాటలు వేస్తోందని.. విద్యారంగంలో సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం మంచి మార్పులు తీసుకొచ్చిందని కొనియాడాడు. పాఠశాలల విషయంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు బాగున్నాయని చెప్పారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను పరిశీలించానని, అన్ని ప్రాంతాలు తిరిగి విషయాలు తెలుసుకుంటున్నానని తెలిపాడు.
రైతులందరూ ప్రభుత్వపరంగా తమకు మంచి మద్దతు అందుతుందని, రైతు భరోసా కేంద్రాలు బాగా ఉపయోగపడుతున్నాయని చెబుతున్నారని అంబటి రాయుడు అన్నారు. ప్రజలకు సేవ చేయాలని తన తాత దగ్గరి నుంచి నేర్చుకున్నానని అంబటి రాయుడు చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa