ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీలో చేరిన ఆనం జయకుమార్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 03, 2023, 09:49 PM

ఆనం జయకుమార్ రెడ్డి చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన వైసీపీలో చేరడం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇప్పుడు టీడీపీకి దగ్గరవ్వగా, ఆనం జయకుమార్ రెడ్డి వైసీపీలో చేరారు. ఈరోజు తాడేపల్లిలో సీఎం జగన్‌ను కలిసిన జయకుమార్‌రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. సీఎం జగన్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జయకుమార్ రెడ్డితో పాటు మరో సోదరుడు ఆనం విజయ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa