నెల్లూరు జిల్లాలో లోకేశ్ అనే పప్పునాయుడు చేసేది యువగళం కాదు.. అదొక కామెడీ గళమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల అన్నారు. లోకేష్ మాట్లాడే మాటలు అర్థంకాక ప్రజలు నవ్వుకుంటున్నారు. ఏమాత్రం రాజకీయ అవగాహన లేని ఈ పప్పునాయుడి యాత్రకు స్పందన రాకపోవడంతో చంద్రబాబులో రోజురోజుకు ఫ్రస్టేషన్ పెరిగిపోతుందన్నారు. ఆ పర్యవసానంతో పూటకో విమర్శలతో ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తూ బురదజల్లే ప్రయత్నాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే లోకేశ్ నెల్లూరు జిల్లాలో పది మంది తన పార్టీ మహిళల్ని పోగేసుకుని మహిళా సమావేశమని పెట్టి ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలకు అంతులేదని, బాబు హయాంలో మహిళల వేధింపుల్లో రాష్ట్రం దేశంలోనే 4వ స్థానంలో ఉండగా, మహిళల అక్రమరవాణాలో రెండోస్థానంలో ఉందని ఎమ్మెల్సీ పోతుల సునీత గుర్తుచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa