పోలవరం నిర్మాణం విషయంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు మారారని.. కానీ అతీగతి లేదని సీపీఎం కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... పోలవరం 2025 డెడ్ లైన్ అంటున్నారని.. అది పూర్తవుతుందో లేదో డౌటే అని అన్నారు. పోలవరం ఆలస్యానికి కారణం ఎవరని ప్రశ్నించారు. ఎలక్షన్కు దండుకోవడమే పోలవరం అని అన్నారు. కేంద్రాన్ని అడగకుండా గత ఐదేళ్లు టీడీపీ మోసం చేసిందని విమర్శించారు. త్యాగం చేసేది పోలవరం నిర్వాసితులు.. అనుభవించేది మనమన్నారు. పోలవరం నిర్వాసితులు త్యాగం చేశారు కాబట్టి ప్రజలంతా వారికి అండగా నిలబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa