ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జమ్మూ కశ్మీర్‌‌లో రెండు రోజులుగా భారీ వర్షాలు,,,,వాగు దాటుతున్న సైనికులు గల్లంతు

national |  Suryaa Desk  | Published : Sun, Jul 09, 2023, 09:01 PM

ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో ఏకంగా 40 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయ్యింది. ఇక, వర్షాల కారణంగా జమ్మూ కశ్మీర్‌లో మెరుపు వరదలు సంభవించి, ఇద్దరు సైనికులు మృతిచెందారు. పూంచ్ జిల్లాలోని సురాన్‌కోట్ వద్ద డోగ్రా కాల్వను దాటుతుండగా ప్రవాహ ఉద్ధృతికి 16 కార్ప్స్‌కు చెందిన ఇద్దరు సైనికులు గల్లంతైనట్టు ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. గల్లైంతన ఇద్దరు సైనికుల మృతి చెందారని తెలిపింది. శనివారం రాత్రి నయిబ్ సుబేదర్ కుల్‌దీప్ సింగ్ మృతదేహం శనివారం రాత్రి లభ్యం కాగా.. సైనికుడు తెలూ రామ్ మృతదేహం ఆదివారం లభ్యమైందని పేర్కొన్నారు.


‘పూంచ్‌లోని క్లిష్టమైన భూభాగంలో ఏరియా డామినేషన్ పెట్రోలింగ్ సమయంలో నదిని దాటుతున్నప్పుడు వరదలో కొట్టుకుపోయిన నయీబ్ సుబేదార్ కులదీప్ సింగ్ అత్యున్నత త్యాగానికి అన్ని ర్యాంకుల అధికారులు నివాళులర్పిస్తున్నారు... మృతుల కుటుంబాలకు భారత సైన్యం సంఘీభావంగా నిలుస్తోంది’ అని ఇండియన్ ఆర్మీ 16 కార్ప్స్ పేర్కొంది.


మరోవైపు, వరుసగా మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో జమ్మూ కశ్మీర్‌లో పలు చోట్ల జనజీవనం స్తంభించింది. దీంతో రెండు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ‘జమ్మూ రీజియన్‌లోని పలు లోతట్టు ప్రాంతాలు సహా కథువా, సాంబ జిల్లాలకు వరద ముప్పు ఉంది.. మెరుపు వరదలు సంభవించే అవకాశాలు పెరుగుతున్నాయి.. వచ్చే 24 గంటల్లో ఈ ప్రాంతాల్లోకి వ్యక్తులందరూ అప్రమత్తంగా ఉండాలి’ అని ఐఎండీ అధికార ప్రతినిధి సూచించారు.


కాగా, హిమాచల్ ప్రదేశ్‌, రాజస్థాన్‌లోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు వరదలు సంభవించి, రాజస్థాన్‌లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్‌ ప్రదేశ్ నదుల్లో ఉద్ధృతి పెరగ్గా.. అనేక చోట్ల రోడ్లు తెగిపోయాయి. కొండచరియలు విరిగిపడి ట్రాఫిక్ నిలిచిపోయింది. పలు ఇళ్లు నేలమట్టంకాగా.. అనేక చోట్ల రైలు పట్టాలపైనా కొండచరియలు విరిగిపడ్డాయి. ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడి రోడ్డుకు అడ్డంగా బండ రాళ్లు పడి ఓ వాహనం నదిలోకి దూసుకెళ్లింది. బండరాయిను తప్పించబోయి.. అదుపుతప్పింది. ఇందులోని 11 మందిలో ఐదుగుర్ని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. ఆరుగురు గల్లంతవగా.. వీరి కోసం గాలిస్తున్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి కూడా ఉన్నారు. ఆయన భార్య ఈ ప్రమాదం నుంచి బయటపడగా.. అతడి ఆచూకీ లభించలేదు. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ ముమ్మరంగా గాలిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa