ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సక్సెస్‌కి షార్ట్ కట్ లేదు.. కష్టపడాల్సిందే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 11, 2023, 06:34 PM

సీఎం జగన్మోహన్ రెడ్డి పెంచిన పన్నులను టీడీపీ అధికారంలోకి రాగానే తగ్గిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ మేరకు మంగళవారం కావలి నియోజకవర్గంలో లోకేష్ తన పాదయాత్ర కొనసాగించారు. తెలుగు దేశం పార్టీ రాగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి పెంచిన పన్నులన్నీ తగ్గిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. నెల్లూరు జిల్లా కొత్తపల్లి గ్రామస్తులతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో నారా లోకేష్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న ‘జగనోరా’ వైరస్‌కు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడే వ్యాక్సిన్‌ అని చెప్పారు. జగన్‌ పాలనలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయని విమర్శించారు.


కావలి ప్రజలు చూపించిన ప్రేమ ఎప్పటికీ మరవలేనని లోకేష్ అన్నారు. 150వ రోజు, 2 వేల కిలో మీటర్లు మైలురాయిని కూడా కావలిలోనే పూర్తి చేసుకున్నానని తెలిపారు. అన్న క్యాంటీన్, చంద్రన్న బీమా, విదేశీ విద్య లాంటి అనేక సంక్షేమ పథకాలను టీడీపీ అమలు చేసిందని.. వీటిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తొలగించారని దుయ్యబట్టారు. జగన్ పాలనలో ప్రజలు భయంతో జీవిస్తున్నాని చెప్పారు. ఆ భయం పోవాలనే ఉద్దేశంతోనే యువగళం పాదయాత్ర మొదలు పెట్టానని వివరించారు.


యువగళం మీ గళాన్ని వినిపించడానికి ఒక వేదిక అని నారా లోకేష్ అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఉద్యోగాలు లేని యువతకు ప్రతి నెలా రూ. 3 వేలు నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పారు. ప్రతి ఏడాది నోటిఫికేషన్ విడుదల చేస్తామని.. పెండింగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. సక్సెస్‌కి షార్ట్ కట్ లేదని.. కష్టపడితేనే జీవితంలో విజయం సాధిస్తారని యువతకు మెసేజ్ ఇచ్చారు. ఇక, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని లోకేష్ అన్నారు. కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. జగన్ విద్యా వ్యవస్థను కూడా నాశనం చేస్తున్నారని.. రాష్ట్రంలో పాఠశాలలను మూసేస్తున్నారని చెప్పారు. టీచర్ల పోస్టులు కూడా భర్తీ చేయడం లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేజీ నుంచి పీజీ వరకు విద్యను ప్రక్షాళన చేస్తామని చెప్పారు. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు వచ్చేలా విద్యార్థులను సిద్ధం చేస్తామని లోకేష్ వెల్లడించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa