విశాఖలోని పాత సామాన్లు (స్క్రాప్) షాపులో సరికొత్త దందా బయటపడింది. మనోడి గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్న అసలు వ్యాపారం గురించి తెలిసి పోలీసులే కంగుతిన్నారు. నగరంలోని జింక్ గేటు సమీపంలో హిమాచల్ నగర్ ఏరియాలో నళినీకాంత్ పాత ఫర్నీచర్, సామాన్లు కొనుగోలు చేసే వ్యాపారం నిర్వహిస్తున్నాడు. బాలాజీ ఓల్డ్ ఫర్నిచర్ షాప్ పేరుతో షాపును నిర్వహిస్తున్నాడు. అది పారిశ్రమిక ప్రాంతం కావడంతో పాటుగా నేవీ ఉద్యోగులు ఎక్కువమంది అక్కడే ఉంటారు.
ఆ దగ్గరలో ఎవరైనా నేవీ ఉద్యోగులు బదిలీపై వెళ్తే.. వారి పాత సామాన్లను తక్కువ ధరకే కొనుగోలు చేస్తుంటాడు. నేవీ ఉద్యోగులు కూడా బదిలీపై వెళ్లే సమయంలో వాళ్లతో పాటు సామాన్లను తీసుకెళ్లలేక మనోడి షాపులో అమ్మేస్తుంటారు.. ఆ సామాన్లను తిరిగి తను అమ్ముకునేవాడు. అలాగే బదిలీపై నగరానికి వచ్చే ఉద్యోగులకు కూడా ఆ సామాన్లు అమ్మేందుకు ప్రయత్నిస్తుండేవాడు. మళ్లీ వాళ్లు బదిలీపై వెళ్తే నళినీకాంత్కే ఆ సామాన్లను అమ్మేసేవారు.
నళినీకాంత్ ఇక్కడే తన తెలివిని ప్రదర్శించాడు. అమ్మకాలు, కొనుగోళ్ల సమయంలో నేవీ ఉద్యోగుల నుంచి డబ్బులు తీసుకునేవాడు కాదు. సార్, సార్ అంటూ అవకాశం ఉంటే లిక్కర్ బాటిల్స్ కావాలని అడిగేవాడు. అలా లిక్కిర్ బాటిల్స్ను తీసుకునేవాడు. కొంతమంది కస్టమర్లు.. నళినీకాంత్ కోరికతో మద్యం బాటిళఖలను ఇస్తుండేవారు. ఇలా తీసుకున్న మద్యం బాటిళ్లను తీసుకెళ్లి తను అమ్ముకునేవాడు.
మనోడు ఒక్కో బాటిల్ను రూ.500లకు కొనుగోలు చేసి.. దాన్ని రూ.1500 చొప్పున డిమాండ్2ను బట్టి ధర నిర్ణయించి విక్రయించేవాడు. కొంతకాలంగా ఈ లిక్కర్ బాటిళ్ల దందా నడుస్తోంది.. అయితే పాత సామాన్ల వ్యాపారం పక్కన పెట్టి మద్యం బాటిళ్ల కోసం వచ్చే వాళ్ల సంఖ్య ఎక్కువైంది. ఈ సమాచారం అందుకున్న ఎస్ఈబీ అధికారులు.. బాలాజీ ఓల్డ్ ఫర్నిచర్ షాప్లో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో ఏకంగా 203 మద్యం బాటిల్స్ దొరికాయి.. పోలీసులు సైతం కంగుతిన్నారు. పట్టుబడిన మద్యం విలువ రూ.3 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మద్యం దందా చేస్తున్న నళినీకాంత్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa