విశాలో సంచలనంరేపిన సీఐ స్వర్ణలత కేసు మరో మలుపు తిరిగింది. రూ.2నోట్ల మార్పిడి కేసులో విశ్రాంత నేవీ అధికారులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో పోలీసులు కోర్టుకు అందజేసిన రిమాండ్ రిపోర్టులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. రూ.90 లక్షలు విలువ చేసే రూ.500 నోట్లను ఇస్తే రూ.కోటి విలువ చేసే రూ.రెండు వేల నోట్లను ఇచ్చేందుకు విశ్రాంత నేవీ అధికారులతో గ్యాంగ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే.
రిటైర్డ్ నేవీ అధికారులు తెచ్చింది 90 లక్షలు కాదు.. రూ.12 లక్షలేనంటు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. తెచ్చిన రూ.12 లక్షల్లో ఆర్ఐ స్వర్ణలత, సూరిబాబు, హోంగార్డు శ్రీనివాసరావులు డబ్బులు పంచేసుకున్నట్లు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. అసలు రూ.90 లక్షలు ఎవరివి ఎక్కడివి అనే దానిపై స్పష్టత లేదు. రిమాండ్ రిపోర్ట్ లో సైతం రూ.90 లక్షల గురించి ప్రస్తావన రాలేదు.
రిటైర్డ్ నేవీ అధికారులను బెదిరించి తీసుకున్న రూ.12.1 లక్షలను నిందితుల నుంచి రికవరీ చేసినట్లు సీపీ తెలిపారు. నోట్ల మార్పిడికి రిటైర్డ్ నేవీ అధికారులు ఎంత మొత్తం తీసుకువచ్చారు?.. రూ.రెండు వేల నోట్లను తీసుకువెళ్లారా? లేదా? అనే ప్రస్తావన లేదు. రూ.12 లక్షల్లో ఆర్ఐ స్వర్ణలత, సూరిబాబు రూ.ఐదేసి లక్షలు చొప్పున.. అలాగే హోంగార్డు శ్రీనివాసరావు రూ.రెండు లక్షలు వాటాలుగా పంచేసుకున్నారట.
ఏఆర్ కానిస్టేబుల్ హేమసుందర్కు వాటా దక్కకపోవడంతో నేవీ విశ్రాంత అధికారి కొల్లి శ్రీను తన ఫోన్ పే ద్వారా రూ.పది వేలు అతడికి పంపించినట్లు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. అసలు నోట్ల మార్పిడికి రూ.కోటి విలువ చేసే రూ.రెండు వేల నోట్లు తీసుకువెళ్లారా? లేదా? అన్నది క్లారిటీ లేదు.. అలాగే రూ.90 లక్షల సంగతి ఏంటనేది తెలియదు. ఈ కేసులో పోలీసులు ఈ నెల ఏడున కోర్టుకు అందజేసిన రిమాండ్ రిపోర్టు బయటకు వచ్చింది. ఈ అంశంపై పోలీసులు స్పందించాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa