పవన్ కళ్యాణ్కు అభిమానులుండరు.. భక్తులుంటారని గర్వం చెప్పుకుంటారు జనసైనికులు. అవును జనసేనానికి ఆ రేంజ్లో ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ సంగతి ఎందుకు అనుకుంటున్నారా.. ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఒడిశాకు చెందిన కిషోర్ ఎలక్ట్రికల్ పనులు చేస్తుంటాడు.. అతడు ఉపాధి నిమిత్తం సింగరాయకొండ వచ్చాడు. కిషోర్ పనులు చేస్తుండగా.. ఓ రాయి వచ్చి తలపై పడి తీవ్ర గాయమైంది. వెంటనే అతడ్ని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు.
యువకుడి తలలో గాయాన్ని పరిశీలించిన డాక్టర్.. కుట్లు వేయాలని సూచించారు. కిషోర్కు మత్తు మందు ఇచ్చారు.. కానీ అతడికి మత్తు ఎక్కలేదు. కుట్లు వేయాలంటే మత్తు ఎక్కాల్సిందే.. లేకపోతే నొప్పిగా ఉంటుంది. దీంతో డాక్టర్కు ఏం చేయాలో తెలియలేదు.. కిషోర్ తనకు పవన్ కళ్యాణ్ అంటే అభిమానం అని.. ఆయన సాంగ్స్ పెడితే చూస్తూ కుట్లు వేయించుకుంటానని చెప్పాడు. డాక్టర్ ఇది విని అవాక్కయ్యారు.. యువకుడు చెప్పినట్లే పవన్ కళ్యాణ్ పాటలు పెట్టించారు. కిషోర్ ఆ పాటలు చూస్తూ కుట్లు వేయించుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుకే పవన్కు అభిమానులు ఉండరు.. భక్తులుంటారని కామెంట్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa