ఉరవకొండ పట్టణంలో జనసేన నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. జనసేన జన ఘోష-జనసేన భరోసా పేరుతో ఈ కార్యక్రమంలో చేపట్టారు. ఇందులో భాగంగా జనసేన అధికారంలోకి వస్తే ఎటువంటి సంక్షేమ పథకాలు అందుతాయి అనే వాటిపై ప్రజలకు వివరించారు. గత నలుగున్న సంవత్సరాల కాలంలో వైసీపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గౌతమ్ కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa