ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ సేవలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 19, 2023, 02:21 PM

ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ సేవలు అందించేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిందని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. మంగళవారం రాజాం పట్టణంలో వస్త్రపురి కాలనీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు గ్రామాల్లోనే అన్ని సేవలకు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లను సీఎం జగన్ ఏర్పాటు చేశారన్నారు. అభివృద్ధిని చూసి ప్రజలు సీఎంగా జగన్ కు మళ్లీ అవకాశం ఇవ్వాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa