తూర్పుగోదావరి జిల్లా, చాగల్లు మండలం కలవలపల్లికి చెందిన వైసీపీ కార్యకర్త దిగుమర్తి నాగరాజు మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కలవలపల్లికి చెందిన వైసీపీ నాయకులు.. కొందరు టీడీపీ నాయకులపై 40 ఎకరాలు పొలం, ఆస్తి వివాదం విషయమై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం సెక్షన్ల కింద నాగరాజుతో అక్రమంగా కేసు పెట్టించారు. ప్రతిఫలంగా వివాదం పరిష్కారమయ్యాక ఒక ఎకరం పొలం ఇస్తామని ఆశపెట్టారు. అయితే అవసరం తీరాక ఎకరం పొలం ఇవ్వకుండా అన్యాయం చేశారని, తన చావుకి కారణం వైసీపీ నాయకులేనంటూ వారి పేర్లతో కొవ్వూరు డీఎస్పీకి లేఖ రాసి, దాన్ని పత్రికలకు విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa