రాబోయే ఎన్నికలతో వైసీపీ కథ కంచికి చేరడం ఖాయమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నియంతపాలన సాగుతోందని, దీనికి చరమగీతం పాడడానికి అన్ని వర్గాల వారు ఎదురు చూస్తు న్నారన్నారు. బీసీలను అణచివేయడం, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు మళ్లింపు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి అన్ని వర్గాల ప్రజలపై పెనుభారం మోపిందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ఓడిపోతామని గుర్తించిన వైసీపీ చివరికి దొంగ ఓట్లు చేర్పించడం లాంటి నీచమైన పనులు చేస్తుందని ఆగ్రహం వ్యక్తపరిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa