అమరావతి రైతులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ తెలిపారు. మీడియాతో ఆమె మాట్లాడారు. ‘‘ప్రభుత్వం కచ్చితంగా రైతులకు కౌలు చెల్లించి తీరాలి. సీఆర్డీఏ కార్యాలయ ముట్టడిలో ఎన్ని ఇబ్బందులు పడ్డమో ఇంకా గుర్తు ఉంది. నాకు అమరావతిలో సెంటు భూమి లేదు... బంధువులు కూడా లేరు. రాష్ట్ర భవిష్యత్ కోసం అమరావతి రైతుల ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యాం. మహిళలు తలచుకుంటే రాజ్యాలే పోయాయి.. ముఖ్యమంత్రి జగన్ ఓ లెక్కా?, సీఆర్డీఏ చట్టం ద్వారా భూములు తీసుకున్న తర్వాత మళ్లీ భూ పత్రాల పరిశీలన ఏంటి?, రాజకీయంగా లబ్ధి కోసమే జగన్ అమరావతిలో ఆర్ 5 జోన్ పేరుతో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. పేదలను అమరావతి రైతులపై ఉసి గొల్పుతున్నారు. రాష్ట్ర ప్రజల గుండెల్లో అమరావతి రైతులు ఉన్నారు. రాహుల్ గాంధీ త్వరలోనే అమరావతి వస్తారు. ప్రియాంక గాంధీ కూడా త్వరలో అమరావతి వచ్చి రైతుల ఉద్యమంలో అడుగు వేస్తారు.’’ అని పద్మశ్రీ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa