పోలవరం ప్రాజెక్టుపై 21 ప్రశ్నల బహిరంగ లేఖను జగన్మోహన్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ ప్రశ్నలపై జగన్ దమ్ముంటే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరానికి జగన్మోహన్ రెడ్డి శనీలా తయారయ్యారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు నాశనం, చేసి ముంచేసారని వ్యాఖ్యలు చేశారు. విధ్వంసం, విద్రోహం, చంపడం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి బ్లడ్లోనే ఉన్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకు 2030 వరకు పోలవరం ప్రాజెక్ట్ అవుతుందా అనేది అనుమానం ఉందన్నారు. కమీషన్ల కక్కుర్తి వలన, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పోలవరంకు చంద్రబాబు హయాంలో అవార్డులు వస్తే, జగన్ హయాంలో చివాట్ల తప్పితే ఏమీ రాలేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa