కర్నూలు జిల్లాలో వింత సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే.... కర్నూలు జిల్లాకు చెందిన తారాచంద్ నాయక్.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం ఎల్లంగుట్ట తండాకు చెందిన పుష్పవతిని 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లయిన కొన్నాళ్ల పాటు ఇద్దరూ బాగానే అన్యోన్యంగా ఉన్నారు. రెండేళ్ల నుంచి వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఇక ఈ మధ్య గొడవలు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం కూడా వారిద్దరూ గొడవపడ్డారు. ఈ క్రమంలోనే పుష్పవతిపై తారాచంద్ దాడి చేశాడు. ఆ తరువాత వెళ్లి పుష్పవతిని ముద్దు పెట్టుకునేందుకు యత్నించాడు. అప్పటికే పీకల్లోతు కోపంతో ఉన్న ఆమె వెంటనే భర్త నాలుకను కొరికేసింది. దీంతో అల్లాడిపోయిన తారాచంద్.. హుటాహుటిన గుత్తి హాస్పిటల్కు చికిత్స నిమిత్తం వెళ్లాడు. తారాచంద్ను పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం హాస్పిటల్కు సిఫార్సు చేశారు. ఇక ఈ విషయమై భార్యాభర్తల వర్షన్ వేరుగా ఉంది. తనపై తారాచంద్ దాడి చేశాడని.. ఆపై తనకు ఇష్టం లేకుండా బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి వచ్చాడని అందుకే నాలుక కొరికానని పుష్పవతి జొన్నగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక తారాచంద్ మీడియాతో మాట్లాడుతూ.. తన భార్యకు వేరొక వ్యక్తితో అఫైర్ ఉందని అయినా కూడా తాను సర్దుకుపోతున్నానని తెలిపాడు. తన భార్యతో తనకు ముప్పు ఉందని చెప్పాడు. తన పిల్లలూ.. తాను ఎలా బతకాలో తెలియడం లేదని వాపోయాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa