విశాఖలో జరిగిన ఓ వివాదంలో పోలీసులకు సాయమందించాలని వెళ్లిన కాలేజీ విద్యార్థి.. ఆకతాయిల దాడిలో ఆస్పత్రి పాలయ్యాడు. విజయగరం జిల్లా కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెంకు చెందిన నవీన్ గోపాల పట్నం సమీపంలో ఆర్ఆర్వీపురంలోని ఆళ్వార్ దాస్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. నవీన్ తల్లి శ్రీదేవి అక్కడే ఉన్న పవర్ ఆఫీస్ పని చేస్తున్నారు.. రోజూ ఆ గ్రామం నుంచి తల్లి, కుమారుడు గోపాలపట్నం వచ్చి.. తమ పనులు ముగించుకుని తిరిగి సాయంత్రం ఇంటికి బయలుదేరి వెళ్లేవారు.
ఈ క్రమంలో సోమవారం సాయంత్రం కాలేజీ ముగిసిన తర్వాత సోమవారం సాయంత్రం కళాశాల విడిచిపెట్టిన తర్వాత తన స్నేహితుడిని ద్విచక్ర వాహనంపై ఎన్ఏడీ కూడలిలో దింపి తిరిగి తల్లి దగ్గరకు వస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్ఆర్ వెంకటాపురం సమీపంలో కొందరు యువకులు కొంతమంది ఆకతాయి యువకులు రోడ్డుపై బైకులు నిలిపి గొడవకు దిగారు. ట్రాఫిక్ పోలీసులు అక్కడికి వస్తున్న క్రమంలో యువకులు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించారు. వారిని పట్టుకోవాలని ఆ కానిస్టేబుల్ కేకలు వేయడంతో.. ఇంతలో అటు వైపుగా వస్తున్న నవీన్ వీరిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. వినయ్ వారికి అడ్డుగా వచ్చాడు.
ముగ్గురు ఆకతాయిలు నవీన్పై పిడిగుద్దులతో మూకుమ్మడిగా దాడి చేశారు.. రోడ్డు పక్కన ఫుట్పాత్పై అతడిని పడేసి ముఖంపై పిడిగుద్దులతో తీవ్రంగా కొట్టారు. అతడు తీవ్ర గాయాలతో కుప్పకూలాడు.. పోలీసులు రావడం గమనించిన ఆకతాయిలులు అక్కడినుంచి పారిపోయారు. తీవ్రగా యాలైన నవీన్ను గోపాలపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. నవీన్ కంటికి, మెడపై బలమైన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. బాధితుని ఫిర్యాదుతో పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వినయ్పై దాడికి పాల్పడిన యువకులు గంజాయి మత్తులో ఉన్నట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఆర్ఆర్ వెంకటాపురం మెయిన్ రోడ్డులో ఎప్పుడూ జనాలు ఉంారు. అలాంటి చోట ఇలాంటి ఘటన జరగడం చర్చనీయాంశమైంది. ఇక్కడ పలు కాలేజీలు ఉండడంతో యువత మద్యం, గంజాయి మత్తుకు బానిసై తరచుగా తగాదాలకు దిగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa