ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతిపై పురందేశ్వరి కామెంట్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 26, 2023, 04:25 PM

రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అమరావతి రాజధాని విషయంపై మరోమారు స్పందించారు. బీజేపీ కోస్తాంధ్ర జోన్‌ సమావేశంలో ఆమె మాట్లాడుతూ..... అమరావతి రాజధాని అనే అంశంపై  బీజేపీ సంపూర్ణంగా కట్టుబడి ఉందని తెలియజేసారు. అందువల్లే అమరావతి చుట్టుపక్కలే కేంద్ర ప్రభుత్వం అనేక సంస్థలను మంజూరు చేసి నిధులు ఇచ్చింది. అమరావతిని ముందస్తుగా స్మార్ట్‌సిటీగా గుర్తించి రూ.2,046 కోట్లు కేటాయించింది. అలానే అమరావతిలో పర్యాటక అభివృద్ధికి రూ.70 కోట్లు విడుదల చేసింది. రాజధానిని రాయలసీమ, బెంగళూరుతో అనుసందానం చేసే దిశగా ఎక్స్‌ప్రెస్‌ హైవేకి రూ.29 వేల కోట్లను మంజూరు చేసింది. అమరావతికి ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్‌ సంస్థని రూ.1,650 కోట్లతో నిర్మించి నాణ్యమైన వైద్యాన్ని పేదలకు అందిస్తోంది. కాబట్టి మేము అమరావతికే కట్టుబడి ఉన్నాం అని తెలియజేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa