ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధరలస్థిరీకరణ నిధి ఎందుకు ఏర్పాటు చెయ్యలేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 26, 2023, 04:30 PM

ఆవ భూముల కొనుగోళ్ళలో వైసీపీ నేతలు దోచుకున్నారని బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మండిపడ్డారు. వైసీపీ నేతలే ఇసుక, మట్టి మాఫియాలుగా మారారన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోటం వల్ల కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు మూడు వేల కోట్ల ధరలస్థిరీకరణ నిధి ఎందుకు ఏర్పాటు చేయలేదో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఏపీలో ప్రజలకు మేలు చేయలేని స్థితిలో జగన్ ఉన్నారన్నారు. రాష్ట్రంలో సర్పంచులకు మద్దతుగా ఆగస్టు 10న జిల్లా స్థాయిలో, ఆగస్టు 17న రాష్ట్ర స్థాయిలో ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పునరావాస ప్యాకేజీ విషయంలో ఏపీ ప్రభుత్వం సరైన గణాంకాలు కేంద్రానికి ఇవ్వటం లేదన్నారు. జనసేనతో పొత్తు కొనసాగుతుందని దగ్గుబాటి పురంధేశ్వరి మరోసారి స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa